HomeUncategorizedతవాంగ్ లో అసలేం జరిగింది

తవాంగ్ లో అసలేం జరిగింది

Published on

Latest articles

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...

వివరాలు బహిర్గతం చేసిన సైన్యం

Indian Army

డిసెంబర్ 9న చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి ఇండియన్ ఆర్మీకి మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన గురించి రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పార్లమెంట్ లో ప్రకటన చేశారు. కానీ నిజంగా అక్కడ ఏం జరిగిందనే విషయాలు మాత్రం పూర్తిగా వెల్లడించలేదు. అయితే.. అందుకు సంబంధించిన వివరాలను భారత ఆర్మీ వర్గాలు బహిర్గతం చేశాయి. గతంలో గాల్వాన్ లోయలో జరిగినట్టుగానే అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ లో మరో దురాక్రమణ యత్నం జరగబోతోందని భారత ఆర్మీ ఇంటలిజెన్స్ ముందుగానే గుర్తించింది. మొత్తం ఆర్మీ అధికారులను అప్రమత్తం చేసింది. చైనాకు షాకిచ్చే అదిరిపోయే వ్యూహాన్ని భారత ఆర్మీ సిద్ధం చేసుకుంది. డిసెంబర్ 9 కు కొద్ది రోజులు ముందుగానే తవాంగ్ లో చైనా సైనికుల సంఖ్య క్రమంగా పెరగటాన్ని భారత్ పసిగట్టింది. ఆ తర్వాత ఇరు దేశాల సైనికులు ఎదురు పడటం.. హెచ్చరికలు.. చిన్న చిన్న చర్చలు జరుగుతూ వచ్చాయి. ఇదే సమయంలో చైనా మాత్రం తన సైనికుల సంఖ్యలను రహస్యంగా పెంచటం మొదలుపెట్టింది. గాల్వన్ లో చేసినట్టుగానే భారత సైన్యంపై దాడి చేసేందుకు ముళ్ళ కర్రలు, ఎలక్ట్రిక్ బ్యాట్ లతో సిద్ధమైంది. భారత్ వైపు 50 మంది సైనికులు ఉంటారని.. వీరిపై భయానకమైన దాడి చేయాలని కుట్ర చేసింది.

డిసెంబర్ 9న భారత సైనికులపై దాడి చేసేందుకు సుమారు 300 మంది చైనా సైనికులు సిద్ధమయ్యారు. ఇక్కడే చైనా.. భారత్ ను తక్కువ అంచనా వేసింది. పరిస్థితి ముందే తెలిసిన భారత సైన్యం కూడా ముళ్ళ తీగ చుట్టిన కర్రలు, మందమైన కర్రలు, రాడ్ లతో సిద్ధంగా ఉంది. ఈ విషయం తెలియని చైనా సైనికులు భారత సైన్యంపై దాడి చేశారు. ఈ దాడికి భారత సైనికులు గట్టి సమాధానం చెప్పారు. క్యూఆర్టీ అని పిలవబడే భారత కమాండో దశం రంగంలోకి దిగి చిన్న చిన్న గ్రూపులుగా విడిపోయి చైనా పొట్టి సైనికులకు తమ సత్తా చూపించటం మొదలుపెట్టారు. ఆయుధాలతో పిచ్చి కొట్టుడు కొట్టడంతో చైనా సైనికులు విలవిలలాడిపోయారు. రక్తంమొడుతున్న తమ తోటి సైనికులను చూసి మిగతా సైనికులు పారిపోయే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన మన సైన్యం.. దొరికిన వాళ్ళను దొరికినట్టు చితక్కొట్టింది. ఇలాంటిది జరుగుతుందని ఊహించని చైనా సైనికులు వెంటనే సరిహద్దు వద్ద పహారా కాస్తున్న తమ అదనపు బలగాలకు సమాచారం అందించటంతో చైనాకు చెందిన అదనపు సైనికులు తుపాకులతో అక్కడికి చేరుకొని గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో భారత సైనికులు దాడి ఆపి వెనక్కి వచ్చేశారు. కొద్ది సమయం తర్వాత ఇరు దేశాల సైనికులు వెనక్కి వెళ్ళిపోయారు. ఈ దాడిలో చైనాకు చెందిన 15 మంది సైనికులు తీవ్ర గాయాలపాలయ్యారని భారత ఆర్మీ పేర్కొంది. ఈ సైనికులు మరణించి ఉండవచ్చని అంచనా వేసింది. మిగితా సైనికులు కూడా గాయాలపాలయ్యారని.. తమ దాడిని ఎదుర్కోలేక పారిపోయారని ఇండియన్ ఆర్మీ చెప్పింది. చావు దెబ్బ తిన్న చైనా.. సరిహద్దుల్లో నిఘా పెంచిందనీ.. వైైమానిక దళం సరిహద్దుల్లో పహారా కాస్తోందనీ ఇండియన్ ఆర్మీ చెప్పింది. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని పేర్కొంది.

FOLLOW US

More like this

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...