HomeNATIONAL NEWS2 వేల నోట్లు డిపాజిట్ అయ్యాక 500 నోటు రద్దు ?

2 వేల నోట్లు డిపాజిట్ అయ్యాక 500 నోటు రద్దు ?

Published on

Latest articles

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...

2 వేల నోటును చలామణీ నుంచి ఉపసంహరిస్తూ కొద్ది రోజుల క్రితం ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆర్బీఐ ప్రకటన వచ్చిన నాటి నుంచీ 2 వేల నోట్ల బ్లాక్ మార్కెట్ దందా విపరీతంగా పెరిగిపోయింది. 2 వేల నోట్లు 5 వందల నోట్లలోకి మార్చటం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద లాభసాటి దందాగా మారిపోయింది. చిట్ ఫండ్ కంపెనీలు, వడ్డీలకు డబ్బులిచ్చే వ్యాపారులు ముఖ్యంగా ఈ దందాను నడిపిస్తున్నారు. బ్లాక్ మనీ కాకుండా కొద్దిపాటి 2 వేల నోట్లు ఉన్నవారు చాలా తక్కువ సంఖ్యలో బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్నారు. చాలా మంది సూపర్ మార్కెట్లు, షాపింగ్ మాల్స్ లో వస్తువులు కొని బిల్లు రూపంలో 2 వేల నోట్లను చెల్లించి భారం దించుకుంటున్నారు. 2 వేల నోట్ల బ్లాక్ దందా ఇప్పుడు పెద్ద చిక్కులు తెచ్చి పెడుతోంది. 2 వేల నోట్లు ఎలాగోలా బ్లాక్ మార్కెట్లో 5 వందల నోట్ల రూపంలోకి మార్చేసుకుంటున్న బ్లాక్ మనీ వ్యాపారులు.. ఆ నోట్లను దాచి పెట్టేస్తున్నారు. దీంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5 వందల నోట్లకు భారీ కొరత ఏర్పడుతోంది. సుమారు గత 2 వారాల నుంచి బ్లాక్ మార్కెట్ దందా వల్ల 5 వందల నోట్లు కనిపించకుండా పోతున్నాయి. దీంతో ఒక కొత్త ప్రచారం చక్కర్లు కొడుతోంది. 2 వేల నోట్లు బ్యాంకులో డిపాజిట్ అయిన తర్వాత టైమ్ చూసి 5 వందల నోట్లను కూడా ఆర్బీఐ బ్యాన్ చేయబోతోందనేది ఆ ప్రచారం సారాంశం.
దేశవ్యాప్తంగా ప్రస్తుతం 5 వందల నోట్లకు భారీ కొరత ఉంది. ఈ కొరతను దృష్టిలో ఉంచుకొని ఆర్బీఐ కొత్తగా 5 వందల నోట్లను ప్రింట్ చేయకపోవటం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వేల కోట్ల రూపాయల 5 వందల నోట్లు ఇప్పటికే దాచిపెట్టబడి ఉన్నాయి. రానున్న రోజుల్లో ఈ కొరత మరింత తీవ్రం అవుతుందని తెలిసినా ఆర్బీఐ 5 వందల నోట్లు ముద్రించకపోవటానికి కారణం.. భవిష్యత్తులో ఈ నోటును కూడా రద్దు చేయటమే అని ప్రచారం జరుగుతోంది. అయితే.. ఆర్బీఐ నుంచి ప్రభుత్వం నుంచి గానీ దీనిపై అధికారిక ప్రకటన ఏమీ రాలేదు. 5 వందల నోట్లు ఉన్న వాళ్ళు ఇప్పడు మార్కెట్లో రారాజులు అయిపోయారు. 10 లక్షల రూపాయల 2 వేల నోట్లు 5 వందల నోట్లలోకి మార్చితే 2 లక్షలు కమిషన్ తీసుకుంటున్నారట. అలా సేకరించిన 2 వేల నోట్లను వేర్వేరు వ్యక్తుల అకౌంట్లలో చిన్న చిన్న మొత్తాలుగా డిపాజిట్ చేసి.. మళ్ళీ వాటిని డ్రా చేసి మళ్ళీ 2 వేల నోట్లు మార్చటానికి ఉపయోగిస్తున్నారు. ఇలా ఒక వంద 2 వేల నోట్లు బ్యాంకులో డిపాజిట్ అయితే వాటి బదులు ఐదారు రెట్లు 5 వందల నోట్లు బ్యాంకుల నుంచి బ్లాక్ మార్కెట్ ద్వారా బ్లాక్ మనీ కలిగి ఉన్న వాళ్ళ సూట్ కేసుల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఆర్బీఐ 2 వేల నోట్ల ఉపసంహరణ నిర్ణయం వల్ల 2 వేల నోట్లు లేని సామాన్యుడికి ప్రస్తుతానికి ఏ ఇబ్బందీ లేకపోయినా.. బ్లాక్ మార్కెట్ దందా ఇలాగే కొనసాగితే 5 వందల నోట్లు కూడా దొరకటం కష్టమైపోతుంది.

FOLLOW US

More like this

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...