Home Blog

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

0

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష విధించటంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ తర్వాత జూలై 7న గుజరాత్ హైకోర్టులో దీనిపై రాహుల్ పిటిషన్ దాఖలు చేయగా.. సూరత్ కోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత మళ్ళీ దీనిపై విచారించాల్సింది ఏమీ లేదంటూ పిటిషన్ ను కొట్టేసింది. దీనిపై ఇప్పుడు రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. రాహుల్ గాంధీ తరఫున సీనియర్ లాయర్ అభిషేక్ సింఘ్వీ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. భారతదేశ న్యాయవస్థపై తమకు నమ్మకం ఉందనీ.. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి విధించబడిన శిక్షపై స్టే దొరుకుతుందనే నమ్మకం ఉందనీ వ్యాఖ్యానించాడు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాహుల్ గాంధీ గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తున్నదని ఆరోపించాడు. అయితే.. ఈ సారి రాహుల్ కు ఊరట లభించవచ్చు అనే అభిప్రాయం వినిపిస్తోంది.

2019లో కర్ణాటక పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. మోడీ అనే ఇంటి పేరు ఉన్న వాళ్ళంతా దొంగలే అనే అర్థం వచ్చేలా వ్యాఖ్యానించాడు. దీనిపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోడీ రాహుల్ గాంధీపై పరువునష్టం కేసు దాఖలు చేశాడు. కేసును విచారించిన గుజరాత్ లోని సూరత్ మెజిస్ట్రేట్ కోర్టు.. రాహుల్ గాంధీకి రెండేళ్ళ జైలు శిక్ష విధించింది. న్యాయమూర్తి హేమంత్ పి ప్రచ్ఛక్ రాహుల్ ముందే తీర్పు చదివి వినిపించి.. పై కోర్టుకు వెళ్ళటానికి నెల రోజుల గడువు ఇస్తూ జైలు శిక్షను నిలుపుదల చేశారు నెల రోజుల పాటు. మెజిస్ట్రేట్ కోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలంటూ తాజాగా జూలై 7న రాహుల్ గుజరాత్ హైకోర్టులో పిటిషన్ వేయగా.. రాహుల్ వాదనతో పాటు నా వాదన కూడా వినాలంటూ పూర్ణేశ్ మోడీ కూడా పిటిషన్ దాఖలు చేశాడు. సుప్రీంకోర్టు కనుక విచారణకు నిరాకరిస్తే.. రాహుల్ గాంధీ వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ కు పోటీ చేయటానికి అర్హత కోల్పోతాడు.

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

0

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు మూతపడనున్నాయి. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం సాయంత్రం 6 గంటల వరకూ హైదరాబాద్ నగరవ్యాప్తంగా మద్యం దుకాణాలు మూసివేయాల్సిందిగా నగర కమిషనర్ సివి ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో లాల్ దర్వాజా బోనాలను తెలంగాణ ప్రభుత్వం వైభవంగా నిర్వహిస్తుంది. ఈ వేడుకల సందర్భంగా ఎక్కడా ఏ అవాంఛనీయ సంఘటనలూ చోటు చేసుకోకుండా వైన్ షాపులను మూసివేస్తారు. ఈ సంవత్సరం కూడా ఈ నెల 16, 17వ తేదీల్లో మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. పోలీసులు ముందుగానే విషయం చెప్పటంతో మందుబాబులు జాగ్రత్తపడుతున్నారు.

వీకెంట్ హ్యాప్పీగా ఎంజాయ్ చేయటం కోసం ముందుగానే రెండు రోజులకు కావాల్సిన స్టాక్ కొనేస్తున్నారు. దీంతో వైన్ షాపులు కళకళలాడుతున్నాయి. మందుకు డిమాండ్ పెరగటాన్ని ముందే ఊహించిన వైన్ షాపు వాళ్ళు.. రకరకాల బ్రాండ్లను షాపుల్లో ఉంచుతున్నారు. ఎక్కువగా అమ్ముడుపోని మందు బాటిల్స్ అన్నీ ఇలాంటి టైమ్ లో స్టాక్ క్లియర్ చేసేస్తున్నారు. అసలు మందే దొరకదేమోనని భయంతో మందుబాబులు కూడా ఏది దొరికితే అదే తీసుకెళ్తున్నారు. రేపు, ఎల్లుండి హైదరాబాద్ నగరవ్యాప్తంగా బోనాలు వైభవంగా జరగనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం సొంత ఖర్చుతో లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి బోనాలు నిర్వహిస్తుండగా.. లక్షల సంఖ్యలో భక్తులు రేపు అమ్మవారికి బోనం సమర్పించుకుంటారు.

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి పుచ్చుకునే సాంప్రదాయం ఉన్న సంగతి తెలిసిందే. ఫ్రాన్స్ పర్యటనలో కూడా మోడీ.. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ కోసం కొన్ని బహుమతులు తీసుకెళ్ళాడు. ఆ బహుమతుల్లో తెలంగాణ పట్టు చీర ఉండటం విశేషం. తెలంగాణలోని పోచంపల్లి పట్టు చీరను మాక్రాన్ సతీమణి బ్రిగెటీ కోసం బహుమతిగా అందజేయటం ప్రాముఖ్యత సంతరించుకుంది. భారత్ లోని మీడియాతో పాటు ఫ్రాన్స్ మీడియా పోచంపల్లి చీరపై చర్చించటం సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం కనిపిస్తోంది. భారతీయ మహిళలు అంటే సాధారణంగా విదేశీయులకు గుర్తు వచ్చేది అచ్చమైన చీరకట్టే. భారతీయ సాంప్రదాయాల్లో అతి ముఖ్యమైనదిగా భావించే చీరను ఫ్రాన్స్ అధ్యక్షుడి భార్యకు బహుమతిగా అందజేయటాన్ని మీడియా హైలైట్ చేస్తోంది.

చందనం కర్రతో చేసిన పెట్టెలో పోచంపల్లి పట్టుచీరను స్వయంగా తన చేతులతో తానే మోడీ ఫ్రాన్స్ అధ్యక్షుడి చేతికి అందజేయటం.. ఆయనకు పోచంపల్లి చీర ప్రత్యేకత గురించి వివరించటానికి సంబంధించిన ఫోటోలను అన్ని మీడియా సంస్థలు సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాయి. ఇంకా చాలా అపురూపమైన బహుమతులు ఈ పర్యటన సందర్భంగా మోడీ ఫ్రాన్స్ అధ్యక్షుడికి అందజేసినప్పటికీ తెలంగాణ పోచంపల్లి పట్టు చీర హైలైట్ కావటం విశేషం. ప్రముఖ మీడియా సంస్థ ఏఎన్ఐ ఈ చీరకు సంబంధించిన ఫోటోను ట్విటర్ లో పోస్టు చేయగా.. ఆ పోస్టు విపరీతమైన లైక్స్, షేర్స్ తో వైరల్ గా మారింది. అసలైన భారతీయ సంస్కృతికి చిహ్నం తెలంగాణ పోచంపల్లి పట్టు చీర అంటూ ఏఎన్ఐ పోస్టులో పేర్కొంది.

భారత్ లో రికార్డులు సృష్టిస్తున్న టామ్ క్రూజ్ “డెడ్ రెకనింగ్”

0

హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్ నటించిన మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ లో కొత్త సినిమా మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రెకనింగ్ భారత్ లో రికార్డు కలెక్షన్లు సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా జూలై 12న విడుదలైన ఈ సినిమా ఫస్ట్ మూడు రోజుల్లో 30 కోట్ల కలెక్షన్లు సాధించినట్టు సినీ ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. నిజానికి ఈ సినిమా ఇంకా ఎక్కువే కలెక్షన్లు రాబట్టాల్సి ఉన్నప్పటికీ.. ఫస్ట్ డే తర్వాత యావరేజ్ అనే టాక్ రావటం వల్ల కలెక్షన్లపై ఎఫెక్ట్ పడిందంటున్నారు. కాకపోతే.. మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ లో మిగతా సినిమాలకు రానంత స్థాయిలో కలెక్షన్లు డెడ్ రెకనింగ్ సాధించిందని చెప్తున్నారు. ఈ రకంగా చూస్తే మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ లో హయ్యెస్ట్ కలెక్షన్లు సాధించింది డెడ్ రెకనింగ్ సినిమాయే. హాలీవుడ్ లో మాత్రం బాక్సాఫీస్ షేక్ చేస్తోందట డెడ్ రెకనింగ్.

ఈ సినిమా బడ్జెట్ 300 మిలియన్ డాలర్లుగా మేకర్స్ చెప్పారు. అది కూడా డెడ్ రెకనింగ్ ఫస్ట్ పార్ట్ బడ్జెట్ మాత్రమే. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ కంటే సెకంట్ పార్ట్ బడ్జెట్ ఇంకా ఎక్కువ ఉండబోతున్నదనీ.. సెకండ్ హాఫ్ లో ఈ సిరీస్ లోనే ఎప్పుడూ చూడని యాక్షన్ సీక్వెన్సెస్ తో పాటు ట్విస్టులు ఉంటాయనీ రిలీజ్ కు ముందే చెప్పారు. భారత్ లో కలెక్షన్లు కాస్త తక్కువగా ఉన్న టామ్ క్రూజ్ సినిమా అంటే వెయ్యి కళ్ళతో ఎదురు చూసే హాలీవుడ్ జనం మాత్రం డెడ్ రికనింగ్ టిక్కెట్ల కోసం ఎగబడుతున్నారు. భారత్ లో కూడా వీకెండ్ లో ఈ సినిమా పుంజుకుంటుందనీ.. భారీ కలెక్షన్లు సాధించటం ఖాయమనీ అంటున్నారు. ఈ సినిమాకు క్రిస్టోఫర్ మెక్వెరీ దర్శకత్వం వహించాడు.

రేవంత్ మంచి జోక్ చేశాడు : హరీష్ రావు కౌంటర్

0

రైతులకు 3 గంటల విద్యుత్ సరిపోతుందంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రేపిన దుమారం మరింత పెరిగింది. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు నిరసనలు చేపట్టడం.. రేవంత్ పై విమర్శలు చేయటం తెలిసిందే. తాజాగా రేవంత్ రెడ్డి మరో వివాదాన్ని తెరపైకి తెచ్చాడు. 2000 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో రైతులపై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. బషీర్ బాగ్ కాల్పుల ఘటనగా ఇది ఏపీ చరిత్రలో దారుణమైన పరిణామంగా నిలిచిపోయింది. విద్యుత్ కోసం ధర్నా చేస్తున్న రైతులపై ఆనాటి ప్రభుత్వం కాల్పులు చేయాలని పోలీసులకు ఆదేశాలివ్వటం.. కాల్పుల్లో ముగ్గురు రైతులు ప్రాణాలు కోల్పోవటం జరిగింది. రేవంత్ రెడ్డి ఈ వివాదాన్ని ఇప్పుడు తెరపైకి తెచ్చాడు. ఆనాడు చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా ఉన్న కేసీఆర్ ఈ బషీర్ బాగ్ ఘటనకు కారణం అంటూ తలా తోక లేని ఆరోపణ చేశాడు. దీనిపై మంత్రి హరీష్ రావు స్పందించాడు. శుక్రవారం సాయంత్రం ప్రెస్ మీట్ లో మాట్లాడిన హరీష్ రావు.. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చాడు.

రైతులకు 3 గంటల కరెంట్ సరిపోతుందంటూ అవగాహన లేకుండా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. బషీర్ బాగ్ కాల్పుల ఘటనకు కారణం కేసీఆర్ అని చెప్పి ఈ శతాబ్ధంలోనే సూపర్ జోక్ చెప్పాడని సెటైర్ వేశాడు. తన రాజకీయ గురువైన చంద్రబాబు చేసిన దారుణాన్ని పాపం రేవంత్ రెడ్డి 23 యేళ్ళ తర్వాత కేసీఆర్ పేరిట ప్రచారం చేసే పని పెట్టుకున్నాడనీ.. కానీ తెలంగాణ ప్రజలకు, రైతులకు అన్నీ తెలుసు అనీ చెప్పాడు. అర్థరాత్రి కరెంటు ఇచ్చి రైతులను పాము కాట్లకు బలి చేసిన కాంగ్రెస్ పార్టీ రైతుల గురించి ఇంత కంటే ఎక్కువ ఆలోచించలేదు అని వ్యాఖ్యానించాడు. తెలంగాణ ఉద్యమానికి ప్రధాన ఎజెండాయే రైతులకు కరెంటు అనే అంశం అనీ.. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకున్న అతిపెద్ద నిర్ణయమే రైతులకు ఫ్రీ కరెంటు అనీ చెప్పాడు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రైతుల కష్టాల గురించి ప్రచురితమైన ఆనాటి పేపర్ క్లిప్స్ ను మీడియాకు చూపించి మరీ రేవంత్ పై ఫైర్ అయ్యాడు హరీష్ రావు. రేవంత్ చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతలే ఆగ్రహంతో ఉండగా.. పార్టీకి చెడ్డపేరు తెచ్చే పనులు మానుకోవాలంటే సీనియర్లు తలంటు పోస్తున్నారు రేవంత్ రెడ్డికి.

వైజాగ్ లో అల్లు అర్జున్ భారీ మల్టీప్లెక్స్

0

టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ రీసెంట్ గా సినిమా థియేటర్ బిజినెస్ లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. అమీర్ పేట్ సత్యం థియేటర్ ను ఏఏఏ మల్టీప్లెక్స్ గ్రాండ్ గా లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు బన్నీ మరో భారీ మల్టీ ప్లెక్స్ ను త్వరలోనే ప్రారంభించబోతున్నాడని టాలీవుడ్ టాక్. వైజాగ్ బీచ్ కు దగ్గర్లో స్థలాన్ని అల్లు అర్జున్ కొనుగోలు చేశాడనీ.. ఇందులో మల్టీప్లెక్స్ కట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయనీ ఇండస్ట్రీ వర్గాల టాక్. త్వరలోనే ఇందుకు సంబంధించిన వర్క్ కూడా స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. అల్లు అర్జున్ కు విశాఖపట్నం అంటే కాస్త సెంటిమెంట్ ఎక్కువ. తన సినిమాలో వైజాక్ కనిపిస్తే ఆ సినిమా ఖచ్చితంగా హిట్ కొడుతుందని అల్లు అర్జున్ నమ్మకం. ఇక వైజాగ్ లో బిజినెస్ చేస్తే కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని నమ్మే బన్నీ.. తన సెంటిమెంట్ ప్రకారమే వైజాగ్ లో స్థలం కొనుగోలు చేసి మల్టీప్లెక్స్ నిర్మించబోతున్నాడని సమాచారం. ప్రస్తుతం విశాఖపట్నం ఏపీ రాజధానిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాబోయే రోజుల్లో వైజాగ్ మరింత డెవలప్ కావటం ఖాయమని భావించిన బన్నీ.. మల్టీప్లెక్స్ నిర్ణయం తీసుకున్నాడట.

చాలా మంది హీరోలు, హీరోయిన్లు తమ కెరీర్ బిజీగా ఉన్న సమయంలోనే తమ సంపాదనతో కొత్త వ్యాపారాలను ప్రారంభించటం మనం చూసాం. రెస్టారెంట్లు, హోటల్స్, జిమ్ సెంటర్స్, జువెలరీ షాప్స్.. ఇలా రకరకాల వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి భవిష్యత్తుపై శ్రద్ధ పెడుతున్నారు. మహేష్ బాబు కూడా ఏఎంబీ పేరుతో థియేటర్ వ్యాపారంలోకి ఎప్పుడో అడుగుపెట్టేశాడు. మిగతా వ్యాపారాల కంటే థియేటర్ బిజినెస్ బెస్ట్ అనేది అల్లు ఫ్యామిలీ ఒపీనియన్. ఇప్పటికే అల్లు ఫ్యామిలీ ఫిల్మ్ ప్రొడక్షన్ తో పాటు డిస్ట్రిబ్యూషన్ లో ఉన్న విషయం తెలిసిందే. ఇక థియేటర్ల చైన్ ఒకటి కూడా విస్తరిస్తే బాగుంటుందని బన్నీ భావించి ఉంటాడు. భవిష్యత్తులో మరిన్ని మల్టీప్లెక్స్ లు బన్నీ నిర్మించటం ఖాయంగా కనిపిస్తోంది.

చంద్రయాన్ 3 సక్సెస్ : ఇంట్రస్టింగ్ ఫ్యాక్స్ట్

0

చంద్రయాన్ 3 ప్రయోగం కోసం భారత్ తో పాటు ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా ఎదురుచూశాయి. ఎట్టకేలకు భారత అంతరిక్ష పరిసోధన సంస్థ ఇస్రో విజయవంతంగా రాకెట్ ప్రయోగం పూర్తి చేయగలిగింది. జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ చంద్రయాన్ 3 ల్యాండర్, రోవర్ తో విజయవంతంగా భూమి నుంచి బయల్దేరింది. మధ్యాహ్నం 2 గంటలకు మూడో దశ ముగిసిందనీ.. ప్రయోగం సక్సెస్ అయ్యిందనీ ఇస్రో చైర్మన్ సోమ్ నాథ్ ప్రకటించారు. ల్యాండర్‌, రోవర్‌ మరియు ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ను తీసుకుని జీఎస్ఎల్వీ రాకెట్‌ నింగిలోకి వెళ్లింది జీఎస్ఎల్వీ మార్క్ 3 రాకెట్.

జీఎస్ఎల్వీ మార్క్ – 3 రాకెట్‌ చంద్రయాన్‌-3 ఉపగ్రహాన్ని భూమి చుట్టూ ఉన్న 170 X 36,500 కిలోమీటర్ల దీర్ఘవృత్తాకార కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. అయితే.. ఇది అప్పుడే చంద్రుడి కక్షలోకి ప్రవేశించదు. 24 రోజుల పాటు భూ కక్షలోనే భూమి చుట్టూ చక్కర్లు కొడుతుంది. భూమికి దగ్గరగా తిరగటం మొదలుపెట్టి రాను రాను భూమికి దూరంగా కక్షలో తిరుగుతుంది. అలా కక్షను పెంచుకుంటూ పోయి ఒకానొక దశలో భూమి ఆర్బిట్ చివర్లోకి చేరుతుంది. ఆ తర్వాత రోవర్ లోని మరో ఇంజన్ ను మండించి దాని వేగం పెంచి చంద్రుడి దిశగా దారి మళ్ళిస్తారు. అలా చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి పరిధిలోకి.. అంటే చంద్రుడి ఆర్బిట్ లోకి రోవర్ ప్రవేశిస్తుంది. చంద్రుడి కక్షలోకి ప్రవేశించిన తర్వాత వేగం తగ్గిస్తారు. అలా చంద్రుడి కక్షలో పరిభ్రమిస్తూ.. అనువైన సమయంలో చంద్రుడిపై ల్యాండింగ్ దిశగా వెళ్తుంది. ఆగష్టు 23 లేదా 24 తేదీలలో ఈ రోవర్ చంద్రుడిపై ల్యాండ్ అవుతుందని ఇస్రో చెప్తోంది.

ల్యాండింగ్ సమయంలో ల్యాండర్, రోవర్ తో కూడిన మాడ్యూల్ చంద్రుడి నేల దిశగా గంటకు 6 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. నేలకు చేరే కొద్దీ నాలుగు ఇంజన్లను ప్రయాణానికి వ్యతిరేక దిశలో మండించి వేగాన్ని తగ్గించుకుంటుంది. వేగం పూర్తిగా నెమ్మదించిన తర్వాత చంద్రుడి దక్షిణ ధృవంలో 70 డిగ్రీల వద్ద రోవర్ నేలను తాకుతుంది. ఆ తర్వాత ల్యాండర్ భూమి నుంచి వెళ్ళే సిగ్నల్ ఆధారంగా పనిచేస్తుంది. ఇప్పటి వరకూ చంద్రుడిపైకి రోవర్ పంపింది కేవలం అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్ దేశాలు మాత్రమే. చంద్రుడిపై పరిశోధన కోసం అమెరికాకు చెందిన స్పేస్ సంస్థ నాసా గట్టి ప్రయత్నాలే చేస్తోంది. 2008లో భారత్ ప్రయోగించిన చంద్రయాన్ 1 ద్వారా చంద్రుడిపై నీటి జాడలను కనిపెట్టి చంద్రుడిపై పరిశోధనల్లో కీలకమైన విషయాన్ని భారత్ కనుగొన్నది. ఆ తర్వాత ఇస్రో చేపట్టిన చంద్రయాన్ 2.. విజయవంతంగా చంద్రుడిపై దిగినప్పటికీ క్రాష్ లాండింగ్ వల్ల భూమి నుంచి సంబంధాలు కోల్పోయి ప్రాజెక్టు విఫలం అయ్యింది. ఇప్పుడు చంద్రయాన్ 3 ను సక్సెస్ ఫుల్ గా ప్రయోగించడం ద్వారా చంద్రుడి వాతావరణాన్ని విశ్లేషించి అత్యంత కీలకమైన సమాచారాన్ని భూమికి అందజేస్తుంది. ఈ సమాచారం కోసం నాసా వంటి సంస్థలు ఎదురు చూస్తున్నాయి.

ఉక్రెయిన్ కు ఎదురుదెబ్బ : మాట మార్చిన నాటో దేశాలు

రష్యాపై పోరాటంలో ఉక్రెయిన్‌కు ఇప్పటివరకూ మద్దతుగా నిలుస్తూ వస్తున్న నాటో కూటమి దేశాలు ఒక్కచోటకు చేరాయి. లిథువేనియా వేదికగా కీలక సమావేశాన్ని మొదలుపెట్టాయి. ఈ సమావేశం లక్ష్యం ఉక్రెయిన్, స్వీడన్ నాటో ఎంట్రీపై స్పష్టత తీసుకురావడంతోపాటు.. నాటో కూటమి దేశాల భద్రతను మరింత పటిష్టం చేయడమే. రెండు రోజులుపాటు లిథువేనియాలోని విల్నియస్‌లో జరిగే ఈ సమావేశంలో
అమెరికా అధ్యక్షుడు బైడెన్ సహా 31 దేశాల అధినేతలు పాల్గొంటున్నారు. ఇప్పటికే స్వీడన్‌ నాటో ఎంట్రీకి అంతా సిద్ధమైంది. తుర్కియే ఒక్కటే అడ్డుపడుతోంది. అదీ మమ అంటే స్వీడన్‌ 32వ సభ్యదేశంగా నాటోలో చేరిపోయినట్లే. యూరోపియన్‌ యూనియన్‌లో చేరడానికి తమకు మద్దతిస్తే స్వీడన్‌ను నాటోలో చేరడానికి అంగీకరిస్తామని తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్‌ మెలిక పెట్టారు. ఇక ఉక్రెయిన్‌కు మాత్రం నాటో ఎంట్రీ అంత ఈజీ కాదనే అనిపిస్తున్నది.

పైకి రష్యాపై నాటో దేశాలు ప్రగల్భాలు పలికినా.. ఉక్రెయిన్ ను నాటోలో చేర్చుకునే విషయంలో మాత్రం పుతిన్ ను చూసి భయపడుతున్నట్టే అనిపిస్తోంది. ఎందుకంటే.. యుద్ధం మొదలై 500 రోజులు దాటి పోయింది. ఇప్పటి వరకూ ఉక్రెయిన్ ను నాటోలో చేర్చుకునే విషయంలో మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇకపై కూడా ఆ దిశగా నాటో దేశాలు కదిలే అవకాశాలు కనిపించటం లేదు. కాకపోతే.. నాటోలో చేర్చుకోకపోయినా సరే ఆయుధ, ఆర్థిక సాయం మాత్రం చేస్తూనే ఉన్నాయి. కానీ దీనిపై ఉక్రెయిన్ సంతోషంగా లేదు. ‘‘తలుపులు తెరిచి ఉన్నాయంటే సరిపోదు. లోపల మేం ఉండాలి’’ నాటో సభ్యత్వంపై ఇటీవల ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చేసిన వ్యాఖ్యలివి.

నిజానికి.. 2008లో రుమేనియాలోని బుకారెస్ట్‌‌లో జరిగిన సదస్సులోనే ఉక్రెయిన్‌ను కూటమిలోకి చేర్చుకుంటామని నాటో హామీ ఇచ్చింది. కానీ ఆ దేశం చేరికపై తొలి నుంచీ సభ్యదేశాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. రష్యాతో యుద్ధం పీక్స్‌కు చేరిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సభ్యత్వ అంశంపై ఆచితూచి వ్యవహరించాలని అమెరికా, జర్మనీ లాంటి కూటమి దేశాలు భావిస్తున్నాయి. మరికొన్ని దేశాలు మాత్రం ఇప్పటికే ఆలస్యమైందని.. కూటమిలోకి ఉక్రెయిన్‌ను ఆహ్వానించాలని, సత్వరం సభ్యత్వం ఇవ్వాలని అభిప్రాయపడుతున్నాయి. ఇటీవల జెలెన్‌స్కీ తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్‌ను కలిశారు. ఆ భేటీలో నాటోలో చేరేందుకు ఉక్రెయిన్‌‌కు అర్హత ఉందన్నారు.
నాటోలో32వ దేశంగా స్వీడన్ చేరడానికి మెలికలు పెడుతున్న ఎర్డోగాన్.. ఉక్రెయిన్ విషయంలో పాజిటివ్‌గా స్పందించారు. ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వమిస్తే రష్యా రెచ్చిపోతుందన్నది అనవసర ఆందోళన మాత్రమేనని మద్దతిచ్చే దేశాలు చెబుతున్నాయి. ఇటీవల ఫిన్లాండ్‌ను కూటమిలోకి చేర్చుకున్నప్పుడు రష్యా పెద్దగా స్పందించని విషయాన్ని గుర్తు చేస్తున్నాయి.

ఉక్రెయిన్‌ నాటో ఎంట్రీకి మద్దతిచ్చే దేశాల వర్షన్ అటుంచితే.. ఈ వ్యవహారంలో ఉక్రెయిన్‌కు కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి. వాటిలో మొదటిది రష్యాతో యుద్ధమే. ఎందుకంటే, నాటో కూటమిలో చేరే దేశానికి రో దేశంతో యుద్ధంలో ఉండకూడదనేది ప్రధాన నియమం. నాటో రాజ్యాంగం ప్రకారం కూటమిలోని ఏ ఒక్కరిపై యుద్ధం జరిగినా మిగిలిన అందరిపైనా యుద్ధంగానే పరిగణించి ఆ దేశానికి కూటమి సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఉక్రెయిన్‌కు సభ్యత్వం ఇస్తే రష్యాతో అమెరికా, బ్రిటన్‌, జర్మనీ సహా నాటో కూటమిలోని దేశాలన్నీ ప్రత్యక్షంగా యుద్ధంలోకి దిగినట్లే. ఉక్రెయిన్‌ తరఫున అమెరికా నేరుగా రష్యాతో పోరాడాల్సిందే. అంటే యుద్ధం విస్తరించినట్లే. ఒక రకంగా అది మూడో ప్రపంచ యుద్ధమన్నమాటే. మరోవైపు.. అధికారిక సభ్యత్వం ఇవ్వకున్నా ఉక్రెయిన్‌కు ఓ సభ్య దేశానికి ఇవ్వాల్సినంత మద్దతిస్తున్నామన్నది నాటో వాదన. ఆర్థికంగా, ఆయుధాలపరంగా ఉక్రెయిన్‌ను నాటో పెద్దన్నలా ఆదుకుంటోంది. అలాంటప్పుడు ఇప్పటికిప్పు డు కూటమిలో చేరకపోయినా ఉక్రెయిన్‌కు వచ్చిన నష్టమేం లేదని నాటో తన వర్షన్‌గా చెబుతోంది.

నాటో కూటమిలో సభ్యత్వానికి కొన్ని ఆర్థిక, రాజకీయ, మిలిటరీ ప్రమాణాలు కూడా న్నాయి. ప్రజాస్వామ్యం పటిష్ఠంగా ఉండాలని నాటో కోరుకుంటుంది. ఉక్రెయిన్‌ రాజకీయ వ్యవస్థ, పాలనా వ్యవస్థలపై నాటోకు నమ్మకం లేదు. ఆ దేశంలో అవినీతి భారీ స్థాయిలో ఉందన్నది వారి అభిప్రాయం. అలాగే, నాటోలో సభ్యత్వం రావాలంటే సభ్య దేశాలన్నీ అంగీకరించాలి. ఏ ఒక్కరు అడ్డుకున్నా సభ్యత్వం రాదు. ఇప్పటివరకు స్వీడన్ ఎంట్రీపై తుర్కియే వైఖరే ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ ఒక్క దేశం ఓకే చెబితే స్వీడన్ ఎప్పుడో నాటో దేశంగా మారిపోయేది. ఉక్రెయిన్‌కు కూడా అలా అడ్డుపడే దేశం ఒకటుంది. ఆ దేశం హంగేరీ. ఉక్రెయిన్-హంగేరీ దేశాల మధ్య కొన్ని సమస్యలున్నాయి. అందుకే నాటో సభ్య దేశమైనా ప్రస్తుత యుద్ధంలో ఉక్రెయిన్‌కు హంగేరీ పెద్దగా మద్దతివ్వడం లేదు. పైగా పుతిన్‌వైపు మాట్లాడుతోంది. ఫ్రాన్స్‌, జర్మనీలు ఉక్రెయిన్‌కు సభ్యత్వంపై అంతంతమాత్రంగానే ఉన్నాయి. వీటన్నింటికీమించి.. రష్యాపై దాడికి నాటో ప్రయత్నిస్తోందంటూ అధ్యక్షుడు పుతిన్‌ పదేపదే ఆరోపిస్తూ వస్తున్నారు. ఇప్పుడు నాటో కూటమిలో ఉక్రెయిన్‌కు సభ్యత్వమిస్తే ఆ ఆరోపణలకు ఊతమిచ్చినట్లు అవుతుంది. పుతిన్‌కు అన్ని విధాలా బలం చేకూరుతుంది. అది నాటోకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇష్టం లేదు. అందుకే ఉక్రెయిన్‌కు బయటి నుంచి మద్దతుకే పరిమితమవుతోంది.

ఈ లెక్కలన్నీ తెలిసిన ఉక్రెయిన్‌ తాజా లిథువేనియా భేటీకి ముందు కీలక ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. ఇప్పటికిప్పుడు ఉక్రెయిన్‌ను నాటో కూటమిలో చేర్చుకోమని తాము అడగ డం లేదనీ.. యుద్ధం ముగిసిన తర్వాతే తమను నాటోలో చేర్చుకోమంటున్నామని తెలిపింది. అయితే చేరికపై రాజకీయ నిర్ణయం, మార్గసూచీ ప్రకటించాలని కోరుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఉక్రెయిన్ నాటో చేరికపై స్పష్టత ఇవ్వాలంటోంది. ఈ నేపథ్యంలో లిథువేనియాలోని ఈ వ్యవహారం నాటోకు అగ్నిపరీక్షగానే కనిపిస్తోంది. మరీ ఈ భేటీ పూర్తయ్యేలోపు కూటమిలోని దేశాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో వేచి చూడాలి.

పుతిన్ ను కలిసిన ప్రిగోజిన్ : తిరుగుబాటుపై కాంప్రమైజ్

రష్యా సైన్యానికీ, పుతిన్ కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన రష్యన్ ప్రైవేట్ సైన్యం వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్.. ఎట్టకేలకు తన తిరుగుబాటు చర్యను ఉపసంహరించుకున్నట్టు రష్యా ప్రకటించింది. రష్యా అధికార ప్రతినితి దిమిత్రి పెస్కోవ్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించాడు. జూన్ 29న పుతిన్, ప్రిగోజిన్ కలిసి చర్చించుకున్నారనీ.. పుతిన్ కోసం యుద్ధం చేయటానికి ప్రిగోజిన్ సైన్యం సిద్ధంగా ఉన్నదన్న విషయాన్ని ప్రిగోజిన్ చెప్పాడనీ పెస్కోవ్ పేర్కొన్నాడు. ఇద్దరి మధ్య ఎలాంటి శతృత్వం ఇప్పుడు లేదనీ.. ఉక్రెయిన్ పై పోరాడేందుకు వాగ్నర్ సైనికులు సిద్ధంగానే ఉన్నారనీ చెప్పడు. మేం ఎప్పుడూ రష్యా సైనికులమే.. రష్యా కోసం ప్రాణాలిచ్చేందుకు మేం సిద్ధం.. ఉక్రెయిన్ తో పోరాడేందుకు కూడా మేం సిద్ధం అని పుతిన్ ముందు ప్రిగోజిన్ చెప్పాడని వెల్లడించారు. దీంతో రష్యాలో నెలకొన్న అంతర్యుద్ధం ముగిసినట్టే.

సుమారు 5 వందల రోజుల క్రితం ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్య మొదలుపెట్టగా.. ఈ యుద్ధం మొదలైన కొద్ది రోజులకే రష్యా సైన్యానికి తోడుగా వాగ్నర్ గ్రూప్ రంగంలోకి దిగింది. అత్యంత శక్తివంతమైన మరియు క్రూరమైన సైనికుల గ్రూప్ గా వాగ్నర్ కు పేరుంది. క్రూరమైన నేరాలు చేసిన వాళ్ళను జైళ్ళ నుంచి బయటకు తీసుకొచ్చి వారికి సైనిక శిక్షణ ఇచ్చి మరింత క్రూరంగా తయారు చేసి వాళ్ళతో వాగ్నర్ గ్రూప్ ను తయారు చేశారని చెప్పుకుంటారు. రష్యాతో పాటు మరి కొన్ని దేశాల్లో వాగ్నర్ గ్రూప్ సైనికులు ఉన్నారు. పుతిన్ చెప్పిన పనిని అత్యంత రహస్యంగా పూర్తి చేసి పెట్టి పుతిన్ కు గానీ పుతిన్ ప్రభుత్వానికి గానీ ఏరకమైన మచ్చ రానివ్వకుండా నేరం తమపై వేసుకొని పనిచేస్తారు ఈ సైనికులు.

కొద్ది రోజుల క్రితం రష్యాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు ఈ వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్. ఉక్రెయిన్ మరియు ఉక్రెయిన్ మద్దతు దేశాలకు ఇది శుభవార్తగా అనిపించింది.. కానీ అంతలోనే బెలారస్ దేశ అధ్యక్షుడు లుకషెంకో ప్రిగోజిన్ ను బుజ్జగించి తిరుగుబాటు ఉపసంహరించేలా చేశాడు. ప్రిగోజిన్ లేదా పుతిన్ ఎవరో ఒక్కరే ప్రాణాలతో ఉంటారు అంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ వ్యాఖ్యానించగా.. అమెరికా ఇంటలిజెన్స్ కూడా పుతిన్ ను ప్రిగోజిన్ చంపేస్తాడు లేదా అధ్యక్ష పదవి నుంచి దించేస్తాడని అంచనా వేసింది. కానీ ప్రిగోజిన్ మరియు వాగ్నర్ సైన్యాన్ని కట్టడి చేయటంలో పుతిన్ విజయవంతమయ్యాడు.

రష్యా ఉక్రెయిన్ యుద్ధం : క్లస్టర్ బాంబులపై అమెరికా క్రూరమైన నిర్ణయం

పెను విధ్వంసం సృష్టించగల క్లస్టర్ బాంబుల విషయంలో అమెరికా అతి క్రూరమైన నిర్ణయం తీసుకుంది. దీనిపై అమెరికా మిత్రదేశాలే భగ్గుమంటున్నాయి. 5 వందల రోజులుగా సాగుతున్నా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అటు ఉక్రెయిన్ ఇటు రష్యాలో కూడా ఆయుధ నిల్వలు అడుగంటిపోయాయి. ఉక్రెయిన్ కు అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ సహా చాలా యూరప్ దేశాలు ఆయుధ సాయం చేస్తుండగా.. వాటిని ఎదుర్కునేందుకు రష్యా తన ఆయుధాగారం మొత్తాన్ని వాడాల్సి వచ్చింది. రష్యా ఇప్పుడు మిత్రదేశాల నుంచి ఆయుధ సాయం కోరుతుండగా.. ఈ క్రమంలో అమెరికా దారుణమైన నిర్ణయం తీసుకుంది. తమ వద్ద పేరుకుపోయిన సుమారు 30 లక్షల క్లస్టర్ బాంబులను ఉక్రెయిన్ కు ఇవ్వటానికి బైడెన్ యంత్రాంగం సిద్ధమైంది. ఈ నిర్ణయంపై ఐక్యరాజ్య సమితి సహా మిగతా ప్రపంచ దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అమెరికా మిత్రదేశాలైన నాటో దేశాలు కూడా దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో మిత్రదేశాలను బుజ్జగించేందుకు బైడెన్ బ్రిటన్ వెళ్ళాడు. సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో అమెరికా తన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మిగతా పేలుడు పదార్థాలు లేదా బాంబులు, మిసైల్స్ తో పోల్చితే క్లస్టర్ బాంబులు పెను విధ్వంసం సృష్టించగలవు. చిన్న చిన్న బాంబులను ఒకే బాంబుగా కట్టగట్టినట్టుగా తయారు చేయటమే క్లస్టర్ బాంబు. ఇది ఎక్కడైతే ప్రయోగిస్తామో అక్కడ పేలి అందులోని చిన్న చిన్న బాంబులు చుట్టుపక్కల వందల మీటర్ల కొద్ది విసిరివేయబడతాయి. అలా విసిరివేయబడిన బాంబులు పడిన చోట పేలిపోయి నాశనం చుట్టుపక్కల ప్రాంతాలను నాశనం చేస్తాయి. ఇలా ఒక్క క్లస్టర్ బాంబు ప్రయోగించటం వల్ల పదుల సంఖ్యలో చిన్న బాంబులు ఎక్కువ విస్తీర్ణంలో విరిసివేయబడి ఎక్కువ ప్రాంతాన్ని నాశనం చేస్తాయి. ఈరకమైన బాంబులను తయారు చేయటంపై 2008లోనే ఐక్యరాజ్య సమితి నిషేధం విధించింది. 120 దేశాలు ఈ నిషేధాన్ని అంగీకరిస్తూ క్లస్టర్ బాంబులు తయారు చేయబోమనీ.. అలాగే ప్రయోగించబోమని ఒప్పందం మీద సంతకాలు చేశాయి. కానీ అమెరికా మాత్రం ఈ ఒప్పందంపై సంతకం చేయకుండా లక్షలాది క్లస్టర్ బాంబులను తయారు చేసింది. విదేశాలకు అమ్మేందుకు లక్షల్లో వీటిని తయారు చేసింది అమెరికా.

కానీ ప్రపంచ దేశాల్లో చాలా వరకూ క్లస్టర్ బాంబుల నిషేధ ఒప్పందంపై సంతకం చేయటంతో కొనేవారు లేక అమెరికా ఈ బాంబులను తయారు చేయటం ఆపేసింది. అప్పటికే తయారు చేసిన 30 లక్షలకు పైగా బాంబులు ఇప్పుడు అమెరికా ఆయుధాగారంలో పేరుకుపోయి అతిపెద్ద భారంగా పరిణమించాయి. ఉక్రెయిన్ కు మొదటి నుంచీ ఆయుధ సాయం చేస్తూ వస్తుండటంతో అమెరికా ఆయుధాగారం కూడా చాలా వరకూ ఖాళీ అయ్యింది. ఉక్రెయిన్ మరోసారి ఆయుధ సాయం అడగటంతో తమ వద్ద ఉన్న క్లస్టర్ బాంబులను వదిలించుకునేందుకు అమెరికాకు మంచి అవకాశం దొరికినట్టైంది. చాటుగా ఈ క్లస్టర్ బాంబులను ఉక్రెయిన్ కు పంపేందుకు అమెరికా నిర్ణయం తీసుకోగా.. మిత్రదేశాలే దీన్ని వ్యతిరేకించాయి. దీంతో బైడెన్ తమ మిత్రులను బుజ్జగించేందుకు పర్యటనలు చేస్తున్నాడు. అమెరికా క్లస్టర్ బాంబులను కనుక ఉక్రెయిన్ స్వీకరించి రష్యాపై ప్రయోగిస్తే.. పుతిన్ అందుకు కౌంటర్ గా జార్ బాంబులను ప్రయోగించేందుకు వెనుకాడడు. ఇదే జరిగితే ఒకే ఒక్క గంటలో ఉక్రెయిన్ బూడిదగా మారుతుంది.